Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యపై అనుమానంతో పసిబిడ్డకు విషమిచ్చిన చంపేసిన కన్నతండ్రి

Advertiesment
deadbody

ఠాగూర్

, శుక్రవారం, 5 జనవరి 2024 (13:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డకు విషమిచ్చి చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐజ పట్టమానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి గత 2019తో వనపర్తి జిల్లా వీపనగుండ్ల మండలం, పెంట్లవెల్లికి చెందిన పల్లవి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన గత యేడాది వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో కుమారుడు, కుమార్తె జన్మించాడు. 
 
అయితే, పెళ్లయిన యేడాది నుంచే భార్యను భార్గవ్ వేధించసాగాడు. అనుమానంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. చివరకు ఫోనులో కూడా మాట్లాడకుండా చేశారు. ఈ క్రమంలో భర్త వేధింపులు తాళలేని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అనుమానంతో ఇంట్లో గొలుసులతో కట్టేశాడని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడలు రావడంతో తన పిల్లలతో కలిసి పుట్టింటింకి వచ్చింది. దీంతో భార్యపై భర్తకు మరింత కోపం పెరిగింది. 
 
ఈ క్రమంలో గత నెల 29వ తేదీన ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి తన కుమారుడు నంద కిషోర్‌కు తాపించాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో ఈ నెల 3వ తేదీన మరోమారు ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి చిన్నారికి తాగించి తాను కూడా తాగాడు. అయితే, కుమారుడు నంద కిషోర్ ప్రాణాలు కోల్పోగా, భార్గవ్ మాత్రం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న పదేళ్ల బాలిక