Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వివాహానికి తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (10:54 IST)
తెలుగు హాస్య నటుడు అలీ తన కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా చేయనున్నారు. ఇందుకోసం పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెను కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె ఫాతిమి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని, ఈ మాటలు చాలా ఆనందానికి, సంతోషానికి గురిచేశాయని చెప్పారు. 
 
మరోవైపు, అలీ తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సూడా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments