Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం, నాయకుల అంచనాలు తల్లకిందులౌతాయి: నరేష్ సెన్సేషన్ కామెంట్

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:13 IST)
VK naresh
సినిమాలతో ప్రజలను జాగృతి పరుస్తాం. రాజకీయాలు ప్రజల్ని పీడిస్థాయి. అయితే అందరూ అలా ఉండరు. కానీ నేడు రాజకీయాలు భ్రష్టుపట్టాయి. అందుకే నేను బి.జె.బి. కి పనిచేసినా నాకు పొసగక బయటకు వచ్చాను. ఇక రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని నటుడు వి.కె. నరేష్ తెలిపారు. తాజాగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో నటించారు. ఇది వర్తమాన రాజకీయాలకు చెందింది అని అన్నారు.

ఆంధ్రలోని పరిస్తితి గురించి చెపుతూ, దేశంలో ఒకప్పుడు ఎమర్జెన్సీ పేరుతో నాయకులను జైల్లో పెట్టారు. అది ఇప్పటికీ మచ్చగా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రలో అలా ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో ఖూనీ చేస్తున్నారు. గతంలో హిట్లర్ వంటి నాయకులు కాలగర్భంలో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యంకు విరుద్ధం. రాజుల కాలం గుర్తుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు.

టోటల్ సినిమా పరిశ్రమ చంద్రబాబు అరెస్ట్ పైన మౌనంగా లేదు. సినిమా హీరోలు ప్రజలకు కష్టాలు వస్తే జోలె పట్టుకుని నిధి సేకరణ చేశారు. కరోనా వంటి ఉపద్రవాలు వస్తే హీరోలు, నేను కూడా సేవ చేసాం. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఆంధ్రలోను, ఇండస్ట్రీలోనూ నిశ్శబ్ద విప్లవం మొదలైంది. దాని ఫలితం ముందుముందు కనిపిస్తుంది అని అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments