Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌పై మరోమారు వాయిదా

chandrababu
, మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టి ఆ పై కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. 
 
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు గత 39 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయంతెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఇక్కడు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?