Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ "శ్రీమంతుడు" - తొలి తెలుగు చిత్రంగా...

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (11:14 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "శ్రీమంతుడు". గత 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకన్యలు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 2.0 బిలియన్లు వసూలు చేసింది. 
 
బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ చిత్రం తాజాగా స‌రికొత్త రికార్డుని త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,080,385 మంది వీక్షించ‌గా, ఇంత‌ వ్యూస్‌ని సంపాదించిన మొద‌టి తెలుగు మూవీగా 'శ్రీమంతుడు' నిలిచింది. త్వరలో 100 మీ వ్యూస్‌ను క్రాస్ చేయనుంది.
 
ఇకపోతే, సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన‌ 'శ్రీమంతుడు' చిత్రం తన తండ్రి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేప‌థ్యంలో రూపొందింది. 
 
దేవరకోట అనే మారుమూల గ్రామంలో తన తండ్రి పూర్వీకుల మూలాల గురించి తెలుసుకున్నప్పుడు, హర్ష వర్ధన్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడమే ఈ చిత్రం కథ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments