చిరు - త్రిష కలిసి నటించనున్నారా? ఇంతకీ ఏ సినిమాలో?

Webdunia
శనివారం, 16 మే 2020 (19:29 IST)
మెగాస్టార్ చిరంజీవి - త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ చిరు - త్రిష కలిసి నటించలేదు. ఆచార్య సినిమాలో చిరు సరసన త్రిష నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. త్రిషపై షూటింగ్ ప్లాన్ చేస్తుంటే... సడన్‌గా ఆచార్య సినిమాలో నటించడం లేదు అంటూ త్రిష షాక్ ఇచ్చింది. 
 
ప్రేక్షకులతో పాటు ఆచార్య టీమ్‌కి కూడా ఇది పెద్ద షాక్. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. క్రియేటీవ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు త్రిష ప్రకటించింది. అయితే.. చిరంజీవి మాత్రం మణిరత్నం సినిమాలో నటించడం కోసం ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడం వలనే త్రిష ఆచార్య నుంచి తప్పుకుందన్నారు. 
 
ఇటీవల త్రిష పుట్టినరోజు నాడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. దీనికి త్రిష కూడా స్పందించి చిరంజీవికి థ్యాంక్స్ తెలియచేసింది. తాజా వార్త ఏంటంటే... చిరు - త్రిష కలిసి నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే... ఆచార్యలో మాత్రం కాదు.
 
 ఆచార్య తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్‌ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించడం ఖాయం అంటున్నారు. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments