Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో అంతుచిక్కని వైరస్.. ముగ్గురు చిన్నారుల బలి.. ట్రంప్‌కు కొత్త తలనొప్పి..!

అమెరికాలో అంతుచిక్కని వైరస్.. ముగ్గురు చిన్నారుల బలి.. ట్రంప్‌కు కొత్త తలనొప్పి..!
, శనివారం, 16 మే 2020 (18:56 IST)
MIS-C
అమెరికాలో ఇప్పటికో కరోనా విజృంభిస్తుంటే.. అగ్రరాజ్యానికి మరో తలనొప్పి వచ్చిపడింది. అంతుచిక్కని వ్యాధితో ఇద్దరు చిన్నారులు బలైయ్యారు. దీంతో అమెరికా తలపట్టుకుంది. అమెరికాలోని న్యూయార్క్‌తో పాటు 17 ప్రావిన్స్‌లలో కొత్త అంతుచిక్కని వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి గురించి న్యూయార్క్ ప్రావిన్స్ గవర్నర్ ఆండ్రూస్ క్యూమో మాట్లాడుతూ.. కరోనాతో పాటు కొత్త అంతుచిక్కుని వ్యాధి వ్యాపించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
 
ఈ అరుదైన వ్యాధి కారణంగా పరిస్థితి అదుపులో లేదని.. ఇది చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని.. మృతులను పెంచుతుందని చెప్పారు. మల్టీసిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (MIS-C) అనే పేరుతో ఈ వ్యాధి చిన్నారులను సోకుతుందని చెప్పారు. ఈ వ్యాధికి కరోనాకు సంబంధం వుందా లేదా అనే కోణంలో పరిశోధన జరుపుతున్నట్లు తెలిపారు. 
 
ఈ వ్యాధి కారణంగా 5, 7, 17 ఏళ్ల ముగ్గురు పిల్లలను బలిగొందని వెల్లడించారు. అంతేగాకుండా MIS-C వ్యాధి న్యూయార్కులో 110 మందికి సోకిందని చెప్పుకొచ్చారు. దీనిపై వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వ్యాధి మరికొన్ని వారాల్లో మరింత సోకే అవకాశం వుందని.. మరో 16 ప్రావిన్స్‌లలో హెల్త్ మినిస్ట్రీ అధికారులు ఈ వైరస్‌ను పరిశీలిస్తున్నారని చెప్పారు. 
 
పిల్లలకు ఐదు రోజులకు పైగా జ్వరం వుంటే, ఆహారంలో తీసుకోవడంలో ఇబ్బంది వుంటే, పొత్తి కడుపులో నొప్పి వుంటే, డయేరియా వుంటే, వాంతులు, శ్వాస తీసుకోవడంలో వుంటే MIS-C వైరస్ వున్నట్టేనని.. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ తెలిపారు. 
 
ఈ కొత్త వైరస్‌ ఇప్పటికే 100 మంది చిన్నారులను ఆవహించింది. వారిలో 55 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ కొత్త వైరస్ తొలుత గుండెను, మూత్రాశయాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్నారులకే ఈ వ్యాధి సులభంగా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

42 ఏళ్ల మహిళ 22 ఏళ్ల యువకుడితో ఎఫైర్, అతడికి పెళ్లనేసరికి చంపేసింది...