బాలీవుడ్ భామే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు! (video)

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:57 IST)
తెలుగులో ఒకటి, రెండు చిత్రాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ముఖ్యంగా, రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. కానీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కియారా సూపర్బ్ రోల్ చేసింది. పైగా, మూవీ సూపర్ హిట్ కావడంతో కియారాకు మంచి పేరు కూడా వచ్చింది. మంచి అందంతో పాటు.. అభినయం ప్రదర్శించింది. 
 
ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీబిజీ తారగా మారిన కియారా.. టాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే చేయాలని చూస్తుంది కానీ.. అస్సలు ఆమెకు అంత టైమ్ ఇవ్వడం లేదు బాలీవుడ్. అయితే ఎలాగైనా ఆమెను టాలీవుడ్‌లోకి తీసుకురావాలని మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.  
 
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌తో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. చరణ్ సరసన ఎట్టి పరిస్థితుల్లోనూ కియారాను తీసుకు రావాలని కొరటాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అలాగే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు కూడా ఫస్ట్ చాయిస్ కియారానే అనుకున్నారు. మొత్తంగా చూస్తే.. కియారాను టాలీవుడ్‌కు రప్పించాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని చెప్పవచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments