Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ 'పుష్ప'లో విలన్‌గా తమిళ హీరో!!

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (15:36 IST)
'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ - 'లెక్కలు మాస్టారు' కె.సుకుమార్ కాంబినేషన్‌లోరానున్న చిత్రం "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 
 
ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. 
 
ఈ క్రమంలో మరో తమిళనటుడు బాబీ సింహ విలన్‌గా నటించనున్నారన్న గుసగుసలు వినిపించాయి. తాజాగా తమిళ హీరో ఆర్య ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారన్న గుసగుసలు తాజాగా వినిపిస్తున్నాయి. అయితే 'పుష్ప'లో ఆర్య విలన్‌గా నటించనున్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 
 
ఇదిలావుండగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పలు డబ్బింగ్ సినిమాలతో 'ఆర్య' తెలుగు ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments