Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ గంజాయికి బానిస? : పనిమనిషి నీరజ్ వెల్లడి

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (15:46 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధానంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. పైగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. 
 
అయితే, సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముంబై పోలీసులకు సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ ఓ సంచలన విషయం వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ తరచుగా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని నీరజ్ సింగ్ వెల్లడించినట్టు సమాచారం. 
 
'సుశాంత్ సార్ తన ఇంట్లోనే వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవారు. మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లను ఉపయోగించేవారు. సుశాంత్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు నేను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చాను. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయి' అని ముంబై పోలీసులకు నీరజ్ వెల్లడించినట్టు ఆ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments