సుక్కు మళ్లీ ఆ హీరోతోనే ప్లాన్ చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:41 IST)
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్... ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. బన్నీ- రష్మిక జంటగా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు.
 
సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగానే ఉన్నప్పటికీ... బన్నీ మాత్రం కరోనా కేసులు తగ్గేవరకు షూటింగ్ వద్దు అని చెప్పేసాడట. ఈ గ్యాప్‌లో సుకుమార్ ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేసాడని తెలిసింది. ఇంతకీ.. ఈ కథ ఎవరి కోసం అంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కోసమని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. గతంలో చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం చిత్రం రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడం తెలిసిందే.
 
ఈ మూవీ చరణ్‌ కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. అయితే.. చరణ్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్‌ చేసే సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో సుకుమార్.. చరణ్‌‌కి కథ చెప్పనున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే... చరణ్‌ - సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావచ్చు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments