Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ.. ఆ రైటర్, డైరెక్టర్ ఇద్దరినీ కలిపాడా..?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:59 IST)
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం "క్రాక్". ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత  రమేష్ వర్మ డైరక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు మరో వార్త బయటకు చ్చింది కానీ.. ఇంకా అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
ఇదిలాఉంటే... రవితేజ మరో సినిమాకి ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే... రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, 'నేను లోకల్' ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడట. 
 
రైటర్ ప్రసన్న కుమార్, డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇద్దరు కలిసి సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత వీరిద్దరి మధ్య డిఫరెన్సస్ రావడంతో విడిపోయారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి రవితేజ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 
 
కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. ఇది ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అట, ముఖ్యంగా... సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్‌తో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని.. తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. చిరు 'చంటబ్బాయి' సినిమాకి ఈ సినిమా సీక్వెల్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments