Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన హీరోతో అలా చేయాలనుకుంటున్న రాశీ ఖన్నా

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:42 IST)
ఏంజెల్ ఆర్నా అంటే ఎవరో తెలియదు నీకు అంటూ ప్రతిరోజు పండుగే సినిమాలో నటించి అందరినీ మెప్పించింది రాశీ ఖన్నా. అంతకుముందు ఎన్నో సినిమాలు రాశీకి మంచి పేర్లే తెచ్చిపెట్టినా ప్రతిరోజు పండుగ సినిమాలో ఆమె నటించిన ఏంజెల్ ఆర్నా పేరుతోనే ఇప్పుడు చాలామంది పిలుస్తున్నారు. ఆమెను ఆ పేరుతో పిలిస్తే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ కూడా చేస్తోందట. 
 
అయితే ప్రస్తుతం లాక్‌డౌన్.. ఇంట్లోనే కూర్చుంది. కానీ రాశీ ఖన్నా మాత్రం ఇంట్లో ఎలాంటి బోర్ లేకుండా తల్లిదండ్రుల కోసం అభిమానుల కోసం సమయాన్ని కేటాయిస్తూ చాలా బిజీగా ఉంటోందట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెబుతున్నారు. అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
 
ఇన్‌స్టాగ్రాంలో రాశీఖన్నాకు అకౌంట్ ఉన్నా దాని జోలికెళ్ళేది కాదట. కానీ ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో అభిమానులతో మాట్లాడేందుకు ఆమె ఉత్సాహం చూపుతున్నారు. ప్రతిరోజు రెండుగంటల పాటు అభిమానులతో లైవ్ చాట్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ మద్య లైవ్ చాట్‌లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటోందట రాశీ ఖన్నా.
 
మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా.. పెద్దలు కుదిర్చిన పెళ్ళా అని అడిగితే ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. ఎందుకంటే నాకు ప్రేమించడం అంటే చాలా ఇష్టమని చెబుతోందట. తెలుగు సినీపరిశ్రమలో మీరు నటించాలనుకుంటున్న హీరోలు ఎవరైనా ఉన్నారని అడిగితే మిల్కీ హీరో మహేష్ బాబు అని చెబుతోందట రాశీ ఖన్నా. అలాగే అల్లు అర్జున్ అని కూడా చెప్పేస్తోందట.
 
ఇద్దరితోను నటించాలని.. అందులోను థ్రిల్లర్ సినిమాల్లో వీరితో కలిసి చేయాలని చెప్పిందట రాశీ ఖన్నా. థ్రిల్లర్ సినిమాలే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే వారిద్దరిలో నచ్చేది నాకు వారి కోపం. ఏ ఫైట్ సీన్లలో అయినా ఇద్దరూ అద్భుతంగా నటిస్తారు. సుప్రీంలో నేను సాయి ధరమ్ తేజ్ కలిసి నటించాను. అందులో పోలీస్ గెటప్‌లో ఇద్దరం కలిసి ఫైట్స్ చేస్తాం.. ఆ సరదా సన్నివేశం అంటే నాకు ఇష్టం. అలా ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలని ఉందని చెబుతోందట రాశీ ఖన్నా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments