Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ రసికుడేమో?.. మంచి అనుభవం వుందట!! : రాశీఖన్నా

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:35 IST)
'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత 2014లో వచ్చిన 'మనం' చిత్రంలో ఆమె కనిపించింది. అక్కడ నుంచి ఆమె సినీ కెరీర్ తిరుగులేకుండా సాగుతోంది. 'బెంగాల్ టైగర్', 'సుప్రీం' వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో చివరగా నటించిన చిత్రం 'వెంకీమామ'. ఈ చిత్రంతోపాటు 'శ్రీనివాస కళ్యాణం', 'ప్రతి రోజూ పండగే' వంటి చిత్రాల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
 
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది. పెరట్లో పూల చెట్లను పెంచుతూ కనిపిస్తోంది. అదేసమయంలో టిట్టర్‌లో తన అభిమానులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెపుతోంది. 
 
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, 'ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు .. స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం మరో కారణం. 
 
తెలుగులో నేను అభిమానించే కథానాయిక సమంత. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు .. అల్లు అర్జున్‌లతో నటించాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా, అల్లు అర్జున్ మంచి అనుభవమున్న హీరో. 
 
అలాగే, నేచురల్ స్టార్ నాని ఓ మంచి వ్యక్తి. ఇలాంటివారితో నటించాలని వుంది. ఇక పెళ్లిపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు వున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలే ఎక్కువ' అంటూ ఈ ఢిల్లీ భామ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments