Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ విని నోరెళ్లబెట్టిన తమిళ నిర్మాతలు...

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (18:19 IST)
తెలుగులో అగ్ర హీరోయిన్‌గా నటి పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. ఈ క్రమంలో పూజా హెగ్డేకు బాలీవుడ్ మూవీలు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 
 
ముఖ్యంగా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెమ్యునరేషన్ పరంగా ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండు చేస్తోంది. తాజాగా తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ఫిగర్ తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
 
తన కెరీర్ తొలినాళ్లలో 'ముగమూడి' అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ఇళయదళపతి విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించడానికి ఈ చిన్నది రూ.3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు, చేసేదేమీలేక ఆమె అడిగినంతా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments