చైతన్య సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందా..?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:57 IST)
అక్కినేని నాగచైతన్య - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఇందులో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ ఇంకా ఓ పాట, కొంత టాకీ షూట్ చేయాల్సివుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్య చేయనున్న మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
ఈ వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుందని చెప్పచ్చు. ఇంతకీ.. ఆ న్యూస్ ఏంటంటే లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు.
 
 ఈ సినిమాకి బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నారు. థ్యాంక్యూ టైటిల్‌తో రూపొందే ఈ విభిన్న కథా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే… ఈ సినిమాలో చైతన్య మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారట.
 
ఈ మూడు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. మనం తరహాలో చాలా కొత్త కథ అని టాక్. ఫైనల్ నెరేషన్ విని చైతు ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఈ మూవీని ఎనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చైతన్య మూడు గెటప్పులో కనిపించడం అంటే కొత్తగానే ఉంటుంది. మరి... ఈ సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments