Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి హీరోగా తెలుగులోకి వేదాళం రీమేక్... కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:17 IST)
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి తన పాత వృత్తిలోకి వచ్చిన మెగాస్టార్... వరుస  చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న "ఆచార్య" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అయినప్పటికీ.. ఆయన తన కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతున్నారు.
 
ఈ కోవలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుంటే, తన కుమారుడు రాంచరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే, తమిళ హీరో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రాన్ని కూడా చిరంజీవి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో చిరంజీవి చెల్లిగా కుర్ర హీరోయిన్ సాయిపల్లవి నటించనుంది. అలాగే, మణిశర్మ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చనున్నారు. 'ఆచార్య' చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత 'లూసిఫర్‌'తో పాటు.. 'వేదాళం' చిత్రాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మెగాస్టార్ నిర్ణయించి, ఆ ప్రకారంగా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకుంటున్నారు. 
 
అయితే, ఈ 'వేదాళం' చిత్రాన్ని కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర కథకు కోల్‌కతా నగరానికి మధ్య ఏదో లింకు ఉంది. అందుకే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన "చూడాలని వుంది" చిత్రం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments