''శ్రీదేవి''గా రకుల్ ప్రీత్ సింగ్.. బయోపిక్‌లోనా?

అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:48 IST)
అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 


అయితే శ్రీదేవి బయోపిక్‌లో రకుల్ నటించట్లేదని.. ప్రతిష్టాత్మకంగా క్రిష్ రూపొందిస్తున్న ''ఎన్టీఆర్'' బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా కనిపించనుందట. 
 
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్, రానా, సీనియర్ నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారని తెలిసింది. అయితే ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందని టాక్. కానీ రకుల్ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక కాలేదని, సీనియర్ హీరోయిన్ ''శ్రీదేవి'' పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 
 
కాగా ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి. అందువలన ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించడం.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందట. ఇక ''ఎన్టీఆర్''లో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments