మెగాస్టార్ ఆఫర్ ఇస్తే నో చెప్పిన హరీష్ శంకర్, ఎందుకో తెలుసా..?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (22:36 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే... ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ రీమేక్ రైట్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ దక్కించుకున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవితో లూసీఫర్ రీమేక్‌ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్‌.
 
అయితే.. లూసీఫర్ రీమేక్‌ని డైరెక్ట్ చేయమని హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. గతంలో పవన్‌తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం తెలిసిందే. పవన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వకీల్ సాబ్, క్రిష్‌తో చేయనున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
 
అయితే... పవన్‌తో సినిమా చేస్తుండడంతో హరీష్ శంకర్ చిరంజీవిని స్వయంగా కలిసి పవన్‌తో సినిమా చేస్తున్నందు వలన ఇప్పుడు లూసీఫర్ రీమేక్‌ని డైరెక్ట్ చేయలేనని.. పవన్‌తో చేయనున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీతో సినిమా చేస్తానని చిరంజీవికి హరీష్ శంకర్ చెప్పారని తెలిసింది. పరిస్థితిని అర్ధం చేసుకున్న మెగాస్టార్ ఓకే చెప్పడంతో పవన్ మూవీ వర్క్ చేస్తున్నారు హరీష్ శంకర్. 
 
ఇప్పుడు లూసీఫర్ రీమేక్‌కి డైరెక్టర్ ఎవరు అంటే... డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పేరు వినిపిస్తోంది. సుకుమార్, వంశీ పైడిపల్లి పేర్లు వినిపించినప్పటికీ.. వినాయక్‌కే ఛాన్స్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విజయం సాధించిన ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసారని.. ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చరణ్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆచార్య మూవీ షూటింగ్ అయిన వెంటనే ఈ సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. లూసీఫర్ డైరెక్టర్ ఎవరనేది త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments