Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత... ఆ పని చేస్తే రజినీకి షేమ్...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (16:16 IST)
రజినీకాంత్ నటించిన 2.ఓ సినిమా తరువాత ప్రేక్షకులు ఆశక్తిగా తిలకిస్తోంది పెట్టా సినిమా కోసమే. పెట్టా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం మానుకుంటున్నారు. రజినీకాంత్, సిమ్రాన్, త్రిషలు కలిసి నటించిన చిత్రం పెట్టా.
 
సినిమా మొత్తం పూర్తిచేసుకుని సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తమిళంలో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నా.. తెలుగులో మాత్రం విడుదల తేదీని మార్చుతున్నట్లు తెలుస్తోంది. కారణం అదేరోజు మూడు కొత్త సినిమాలు విడుదల అవుతుండడమేనట. 
 
బాలక్రిష్ణ నటించిన కథానాయకుడు, చరణ్‌ నటించిన వినయ విధేయ రామ, వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2 సినిమాలు సంక్రాంతి పండుగ రోజే విడుదల కానున్నాయట. అన్నీ సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చేశారట. దీంతో సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని తీసేసుకున్నారట. 
 
పండుగ రోజు తమ అభిమాన నటుడు రజినీ సినిమా చూడాలనుకుంటున్న అభిమానులకు పెద్ద నిరాశే మిగిలింది. ఇదే జరిగితే రజినీకాంత్ కు ఇది పెద్ద షాకే అవుతుంది. పైగా షేమ్ అని అంటున్నారు ఆయన అభిమానులు. దక్షిణాది సూపర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేయకపోవడం ఏంటని అంటున్నారు. మరి సి. కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments