Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల కారవన్‌పై తెరాస శ్రేణుల రాళ్లదాడి

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (16:48 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల నుంచి నిరసన సెగతో పాటు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆమె విశ్రాంతి తీసుకునే కారవన్ వాహనంపై కొందరు తెరాస కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 
 
ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 
కాగా, తెరాస మంత్రి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెరాస కార్యకర్తలు ఆగ్రహంతో వైకాపా ఫ్లెక్సీలను చింపివేశారు. షర్మిల కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 
 
దీనిపై షర్మిల స్పందిస్తూ, తెరాస ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సులను తగలబెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నానని, శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్టు చేయాలని, తద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను తమ పాలేర్లుగా తెరాస నేతలు వాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments