Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాళేశ్వరం స్కామ్‌ను హైలైట్ చేసేందుకు ఢిల్లీకి వచ్చాను.. వైఎస్ షర్మిల

ys sharmila
, శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:57 IST)
YS Sharmila
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ చేపట్టారు. ఈ సందర్భంగా హస్తినలో షర్మిల మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని హైలైట్ చేయడానికి తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుంభకోణం చాలా పెద్దదని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖజానాకు ఖర్చయ్యే డబ్బు రూ1.2 లక్షల కోట్ల మొత్తం చేరిందన్నారు. ఈ ప్రాజెక్టు కింద స్కామ్ జరిగిందని.. కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. 
 
ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆస్తులు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులతో సమావేశమై ఫిర్యాదు చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో సీటు కోసం మహిళా ప్రయాణికుల సిగపట్లు : వీడియో వైరల్