Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న గుండెంగి గ్రామంలో వైఎస్. షర్మిళ ఉద్యోగ దీక్ష

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (19:55 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ప్రతి మంగళవారం ఒక రోజు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు గ్రామాల్లో ఆమె దీక్ష చేశారు. ఈ దీక్షలో భాగంగా, ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చుతున్నారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మహబూబాబాద్ జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఉద్యోగ దీక్ష చేయనున్నారు. అనంతరం మంగళవారం రాత్రి వరంగల్ పట్టణంలోనే షర్మిల బస చేస్తారు. ఉద్యోగ దీక్షతో పాటు పోడు భూముల పోరుకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు.
 
మరోవైపు ఎల్లుండి (బుధవారం) ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల గత మంగళ వారం హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments