Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిలకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? హెల్త్ బులిటెన్ రిలీజ్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (15:33 IST)
తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న ఏకైక డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఆమరణ నిరాహారదీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేసిన ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, బీపీ, బలహీనత, మైకగా ఉండటంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటాబాలిక్ అసిడోసిమ్, ప్రీరీనల్ అజోటెమియా కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. షర్మిల 2 లేదా 3 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 
 
కాగా, తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో ఆమె లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ టీపీ ప్రధాన కార్యాలయంలో ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నుంచి చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments