Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ తీగలపై నడుచుకుంటూ వెళ్లి చెట్ల కొమ్మలు తొలగించిన యువకుడు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:04 IST)
ఓ యువకుడు చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుండగా విద్యుత్ శాఖ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ఇలాంటి కొమ్మలు కొన్ని విద్యుత్ తీగలపై కూడా కూడాపడ్డాయి. 
 
ఈ కొమ్మలను తొలగించేందుకు ఓ విద్యుత్ ఉద్యోగి సాహసం చేశాడు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి ఆ చెట్టు కొమ్మను తొలిగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చిత్రీకరించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటుచేసుకుంది. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేసిన ఈ సాహసం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రజలు మాత్రం అధికారులపై మండిపడుతున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో అతడికి ఏ ప్రమాదమూ జరగలేదు. అతడు విద్యుత్‌ తీగతలపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments