తెలంగాణలో కరోనా మహమ్మారి.. ఆరుగురు మృతి.. డీజీపీ ఆఫీసులో కూడా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:01 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తెలంగామలో సోమవారం ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలొదిలిన వారి సంఖ్య 88కు చేరింది. సడలింపుల తర్వాత జీహెచ్‌ఎంసీ బయట జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
తాజాగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు రాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు 434 మందిలో పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో 2358 మందితో మొత్తం 2792కు పాజిటివ్‌ కేసులు చేరాయి. వీరిలో 1491 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మిగిలిన 1213 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
రాష్ట్ర పోలీసు శాఖ హెడ్‌క్వార్టర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. లక్డీకాఫూల్‌లోని డీజీపీ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కార్యాలయ వర్గాలను బట్టి తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు

Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్

Chiru: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం. రుషికి అభినందనగా ల్యాప్‌టాప్ బహుకరించిన చిరంజీవి

ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు

తర్వాతి కథనం
Show comments