Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టల్ ద్వారా యాదాద్రి ప్రసాదం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:32 IST)
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు.

స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారులు పోస్టల్శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాల నుంచి భక్తుల కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు.

ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments