Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:30 IST)
వైకాపా ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు సూచించారు. బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు.

వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సూచించారు.

గత కౌన్సిల్‌లో జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవేనన్న యనమల... అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను కౌన్సిల్‌ పరిశీలించే అవకాశం ఉందన్నారు.

రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో మండలికి కూడా అధికారాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులపై మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అన్నారు.

తాము బిల్లులను అడ్డుకోలేదని సెలెక్ట్‌ కమిటీకి మాత్రమే పంపామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని క్రోడీకరించడం తప్పా? అని నిలదీశారు.

మండలి ఛైర్మన్‌ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తప్పుబడతారా? అని మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌పై ప్రివిలైజ్‌ నోటీసు ఇస్తారని తెలిసిందన్న యనమల... ఆ అధికారం ఉంటుందా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments