Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ జిల్లాలో దారుణం.. కుమార్తె హతమార్చిన తల్లి, అమ్మమ్మ

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (12:50 IST)
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్, పర్వతగిరి మండల కేంద్రానికి ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. 
 
పెద్ద కుమార్తెకు వివాహం జరగడంతో.. చిన్న కుమార్తె అంజలి(17) తల్లి వద్ద వుంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో కుమార్తెను మందలించింది. కులాంతర వివాహం కుదరదని తేల్చి చెప్పేసింది. 
 
అయినా అంజలి తీరు మారకపోవడంతో తమ కుటుంబ పరువు తీస్తోందనే ఆగ్రహంతో చివరికి చంపాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 19న అర్థరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న అంజలి గొంతును తల్లి నులమగా, అమ్మమ్మ ముఖంపై దిండుతో అదిమింది. 
 
అంజలీని ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుందని కేకలు వేశారు. కానీ పోలీసులు జరిపిన దర్యాప్తులో నిందితులు అంజలి తల్లి, అమ్మమ్మేనని తేలింది. పోలీసులు వారి అదుపులో తీసుకున్నారు 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments