Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.18 వేల కోట్లు ఇస్తే మునుగోడు ఉప పోరు నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (12:49 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నల్గొండకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని ఇస్తే మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. ఫ్లోరోసిస్‌ నిర్మూలనకు మిషన్‌ భగీరథకు రూ.19,000 కోట్లు కేటాయించాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం కేటీఆర్ ఆరోపించారు. 
 
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం ఓ వ్యక్తికి రూ.18 వేల కోట్ల ప్రాజెక్టును మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగితే దేశ సంపద పెరగదని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి కాంట్రాక్ట్‌ కేటాయిస్తే జిల్లా అభివృద్ధి చెందదని అన్నారు.
 
గత ఐదు నెలల్లో గుజరాత్‌కు రూ.80 వేల కోట్ల ప్యాకేజీలను కేంద్రం మంజూరు చేసిందని, తెలంగాణకు రూ.18 వేల కోట్లు కేటాయించలేదా? అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments