వాట్సాప్ వినియోగంపై భార్యాభర్తల కీచులాట... ఇద్దరూ ఆత్మహత్య

సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (10:53 IST)
సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెబుతానని అనడంతో మనస్థాపానికి గురైన భర్త శివకుమార్‌ రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తన వల్లే శివకుమార్‌ మృతి చెందాడని స్థానికులు అనడంతో మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌కు చెందిన వెన్నెల అనే యువతి నిన్న మధ్యాహ్నం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాట్సాప్‌ చాటింగ్‌ కారణంగా ఇద్దరూ రెండ్రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments