Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ వినియోగంపై భార్యాభర్తల కీచులాట... ఇద్దరూ ఆత్మహత్య

సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (10:53 IST)
సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెబుతానని అనడంతో మనస్థాపానికి గురైన భర్త శివకుమార్‌ రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తన వల్లే శివకుమార్‌ మృతి చెందాడని స్థానికులు అనడంతో మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌కు చెందిన వెన్నెల అనే యువతి నిన్న మధ్యాహ్నం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాట్సాప్‌ చాటింగ్‌ కారణంగా ఇద్దరూ రెండ్రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments