Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో అక్రమ సంబంధం.. భార్యకు తెలిసి...

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో అక్రమ సంబంధం.. భార్యకు తెలిసి...
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:03 IST)
ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి(26), వేణుగోపాల్‌ అలియాస్‌ వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 2012లో జరిగింది. వీరి సంసారజీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ క్రమంలో తనతో పాటు పని చేసే ఓ యువతితో వంశీకి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇదిలావుండగా, సంస్థ ప్రచార పని మీద వంశీ గోవాకు వెళ్లాడు. అక్కడ మరో యువతితో సంబంధం నెరిపాడు. ఆమెనూ వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకున్నాడు. అతని భార్యకు తెలియడంతో మనోవేదనకు గురై శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి ఇంట్లో ఉన్న ఆమె సోదరి ప్రశాంతి అక్క పరిస్థితిని గమనించి జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణగండం తప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా తెదేపా... కేటీఆర్ సెటైర్లు