అక్రమ సంబంధం వద్దన్నాడనీ... భర్తను ఎలా చంపిందో చూడండి

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (09:49 IST)
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో సొంత భర్తనే ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది.
 
బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్యా, పిల్లలతో కలిసి బతుకుతున్నాడు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో ఓ జ్యూస్ పాయింట్ ప్రారంభించాడు.

ఇందులో పనిచేసేందుకు వారికి దూరపు బంధువైన లాల్‌బాబును నియమించాడు. అయితే లక్ష్మణ్‌ జా భార్య కుష్బుదేవికి, బంధువైన లాల్‌బాబుకు సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి మెడకు చున్నీ బిగించి చంపేసింది.

మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది.

సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments