హిజాబ్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారంటే? అవి ధరిస్తే తప్పేంటి?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:07 IST)
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హిజాబ్ వ్యవహారంపై కోర్టు ఇచ్చిన తీర్పు... మతం, సంస్కృతి, వ్యక్తీకరణ, కళ వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. 
 
ఇది ముస్లిం మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదన్నారు అసద్. హిజాబ్‌ ధరిస్తే సమస్య ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. 
 
కర్నాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇదే విషయమై స్పందించారు. కోర్టు తీర్పు చాలా నిరాశజనకమైనదన్నారు. ఓ వైపు మనం మహిళల హక్కులు , వారి సాధికారతపై పెద్ద  పెద్ద వాదనలు చేస్తున్నామన్నారు. మరోవైపు వారు కోరుకున్నది ధరించే హక్కు కూడా మనం వారికి ఇవ్వడం లేదన్నారు. ఈ హక్కు కోర్టులకు ఉండకూడదన్నారు మెహబూబా ముఫ్తీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments