Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛైర్మన్​, మేయర్​ పదవులన్నీ మనవే: కేసీఆర్

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:11 IST)
పురపాలక ఎన్నికల్లో తెరాస విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు..పురపాలక ఇన్‌ఛార్జ్‌లతో జరిగిన సమావేశంలో వివరించారు.

పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్​ పంపిణీ చేశారు. పురపాలికలు, నగరపాలికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు.

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉందని కేసీఆర్​ తెలిపారు. నాయకత్వం వహించాలని ఆశపడటంలో ఏ మాత్రం తప్పు లేదని.. అయితే టికెట్ దక్కని నేతలు నిరాశ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని... నామినేటెడ్ పోస్టులు ఎన్నో భర్తీ చేయాల్సి ఉందన్న విషయం వివరించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. అసంతృప్తులు, అసమ్మతుల మాట వినిపించకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments