Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయులోని రోగిని కొరికిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:28 IST)
వరంగల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఐసీయు వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికాయి. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులు కొరికేయడంతో ఆ రోగికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
వరంగల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వార్డులోని ఎలుకలు ఆ రోగి కాళ్లు, చేతులు కొరికివేశాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఎలుకలు తరిమేసి శ్రీనివాస్‌కు వైద్యం చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments