Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:25 IST)
ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 
గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు.
 
2016లో ప్రారంభమైన 'తల్లీబిడ్డ' ఎక్స్‌ప్రెస్‌ పథకం నిర్వహణ సంస్థ మూడేళ్ల కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. మరో సంస్థను ఎంపిక చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం జరిగింది. టెండరు ద్వారా కొత్తగా ఎంపిక చేసిన ఓ సంస్థ ఈ ఏడాది మార్చి నుంచి సేవలను కొనసాగించాల్సి ఉంది. 
 
ప్రస్తుతం వాడుకలో ఉన్న మారుతి వాహనాల ద్వారా కాకుండా స్పోర్ట్స్‌ యుటిలిటీ, మిడ్‌ లెవల్‌ యుటిలిటీ స్థాయి వాహనాల ద్వారా బాలింతలను పంపించాలని ప్రభుత్వం షరతు విధించింది. 
 
అయితే అర్హత సాధించిన సంస్థ చూపించిన వాహనాలు, వాటిలోని సౌకర్యాలు ప్రమాణాలకు తగ్గట్లు లేనందున అధికారులు అంగీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments