Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:40 IST)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరంగల్‌లో సీనియర్ వైద్యుడు సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ నేపథ్యంలో డా. సైఫ్‌కు రూ. గ్యారెంటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేశారు. ఇంకా వచ్చే 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే విచారణ సందర్భంగా బెదిరింపులకు పాల్పడినా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. 
 
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గతంలో నిర్ధారించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments