Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్దుల్ కలాం పేరును కూడా మార్చేసిన వైకాపా ప్రభుత్వం

ysrviewpoint
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:41 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన సీతకొండలోని వ్యూపాయింట్‌కు గత టీడీపీ ప్రభుత్వం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి డాక్టర్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పేరు పెట్టింది. ఇపుడు ఈ పేరను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చింది. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "భారత రత్న" అబ్దుల్ కలాంకు ఇది తీరని అవమానమని వ్యాఖ్యానించారు. అలాగే, ఈ వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసిన స్వచ్ఛంద సంస్థ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన పేరు పెట్టిన ప్రాంతానికి మీరు ఎలా పేరు మారుస్తారంటూ సూటిగా ప్రశ్నించింది. 
 
వైజాగ్ నగరంలో ఇటీవల జీ20 సందస్సు జరిగింది. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు సీతకొండ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌కు గత నెలలో ఆమోదం లభించింది. తాజాగా 150 మీటర్ల పరిధిలోని సుందరీకరణ పనులు పూర్తి చేసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ స్థానంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అక్షరాలు చెక్కించారు.
 
ఈ పేరు మార్పుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు మార్చడం మానసిక శాడిజానికి ప్రతీక అని దుమ్మెత్తి పోస్తూ వ్యూ పాయింట్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, పారదర్శకతకు అబ్దుల్ కలాం మారుపేరని, ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఆయనను పేరు మార్పు ద్వారా అవమానించారంటూ మండిపడ్డారు. కాగా, వ్యూపాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టి అభివృద్ధి చేసింది తామేనని ఇపుడు తాను పేరును మార్చడం సరికాదని వైజాగ్ వలంటీర్స్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో నేపాల్ అధ్యక్షుడు అడ్మిట్