Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖకు పరిపాలనా రాజధాని ఖాయం : వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy
, ఆదివారం, 24 జులై 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టేలా లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్‌‌గా నియమితులైన తితిదే ఛైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి ఆదివారం వైకాపాకు చెందిన నేతలు, జీవీఎంసీ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని చెప్పారు. 
 
వీలైనంత త్వరలో న్యాయపరమైన సమస్యలు, చిక్కులు తొలగిపోయి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇకపోతే, ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకే విపక్షాలు వరదలను తమ రాజకీయాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయన్నారు. వరద బాధితులను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని, అనేక లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ