Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిది..

Advertiesment
Telangana
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:55 IST)
తెలంగాణ సర్కారు అందించిన కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులు, సొంత నిధులతో పోచంపల్లి పట్టుచీర, దోతి, టవల్‌ను లబ్ధిదారులకు కానుకగా అందజేశారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 
భువనగిరి పట్టణం, మండలానికి కలిపి మొత్తం 124 చెకులకు గాను సుమారు 1 కోటి 25 లక్షలకు పైగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఈ సమావేశంలో జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్దుల్ కలాం పేరును కూడా మార్చేసిన వైకాపా ప్రభుత్వం