Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని వల : ప్రాణాలు తీసుకున్న యువకుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమ పేరుతో తన స్నేహితురాలి సోదరుడుకి వలవు వల వేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుగ్గొండి మండలం లక్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన స్నేహితురాలి అన్నకే వలేసింది. రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన తన స్నేహితురాలి అన్నకు ఫోన్ చేసింది. 
 
ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేస్తూ ముగ్గులోకి దించింది. అనంతరం ఆ ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగేయత్నం చేసింది. దాంతో భయపడిన యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments