Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని వల : ప్రాణాలు తీసుకున్న యువకుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమ పేరుతో తన స్నేహితురాలి సోదరుడుకి వలవు వల వేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుగ్గొండి మండలం లక్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన స్నేహితురాలి అన్నకే వలేసింది. రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన తన స్నేహితురాలి అన్నకు ఫోన్ చేసింది. 
 
ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేస్తూ ముగ్గులోకి దించింది. అనంతరం ఆ ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగేయత్నం చేసింది. దాంతో భయపడిన యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments