Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలాలకు వెళ్లే రైతులను చితకబాదుతున్న విరుగుతున్న లాఠీ

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్డౌన్ అమలవుతోంది. అయితే, రైతులకు మాత్రం ఈ లాక్డౌన్ ఆంక్షలు వర్తించవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రోడ్ల మీద కనిపిస్తున్న రైతులను చావబాదుతున్నారు. అన్నదాతలపై లాఠీ ఝళిపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్‌ జిల్లా పరిధిలో పొలాలకు వెళ్తున్న రైతులపై గత మూడు రోజుల్లో పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆదివారం అంబేద్కర్‌ నగర్‌ నుంచి తన పొలానికి వెళ్తున్న ఓ రైతును పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. ఆ రైతు చేతిపై వాతలు పడ్డాయి. తీవ్రనొప్పి ఉండటంతో చేతిని కదపలేకపోతున్నాడు. 
 
'పొలం వద్ద పశువులకు నీరు పెట్టి గడ్డి వేసి వస్తాను సార్' అని చెప్పినా కూడా పోలీసులు అదేమీ వినిపించుకోకుండా కొట్టారని తెలిసింది. అలాగే.. మందుల కోసం మెడికల్‌ షాపులకు, చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
వెంకటయ్య అనే వ్యక్తి ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయనకు జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ నారాయణ, వెంకటయ్యకు ఆదివారం ఫోన్‌చేసి జరిమానా గురించి ఆలోచించవద్దని ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి మాట్లాడటంతో వెంకటయ్య సంతోషం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments