Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 10 March 2025
webdunia

ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం

Advertiesment
ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:45 IST)
కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.
 
ఆకలితో చస్తే చావు అంటూ రైతు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా మంత్రి అన్నారు. దీనితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పైగా మంత్రిగారు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై తనకు ఫోన్ చేయవద్దంటూ మండిపడ్డారు.
 
ఇంకా మంత్రి మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకలో బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇస్తున్నాం. త్వరలో బియ్యం పెంచుతామని చెప్పారు. కాగా మంత్రిగారు మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. మొత్తమ్మీ కర్నాటక మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఓ మంత్రి సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్: ఇంట్లోనూ మాస్క్ ధరించడం వల్ల ఫలితం ఉంటుందా? 24 గంటలూ మాస్క్ ధరించడం సాధ్యమేనా?