పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు : నటి విజయశాంతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (11:32 IST)
తాను పార్టీ మారుతున్నాంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి, బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అదేసమయంలో తాను పార్టీ మారడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో స్పష్టంచేశారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. తాను బీజేపీని వీడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీని ఎందుకు వీడుతానని ఆమె స్పష్టంచేశారు. 
 
కాగా, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు తన గురించి ఎన్నో రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కడా కూడా నోరు విప్పలేదు. 
 
ఈ ప్రచారం ఇలా సాగుతుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరో రెండు మూడు రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ ప్రకటించి, ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంతో పాటు వైరల్ కావడంతో విజయశాంతి నోరు విప్పక తప్పలేదు. తాను బీజేపీని వీడుతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఆమె స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments