Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై ఎస్ఐ అత్యాచారం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (10:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడు ఎవరో కాదు. మహిళలతో పాటు సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఎస్ఐ కావడం గమనార్హం. ఈ ఘటన జైపూర్‌ సమీపంలోని దౌసా జిల్లాలో జరిగింది. బాధిత బాలిక వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. 
 
జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న భూపేంద్ర సింగ్ శుక్రవారం బాధిత చిన్నారికి తినుబండారాలు ఆశజూపి తన అద్దె గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిందితుణ్ని పట్టుకొని కర్రలు, చెప్పులతో దేహశుద్ధి చేశారు. చిన్నారిపై ఎస్ఐ అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటని గవర్నర్ కల్రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
 
మరోవైపు, ఈ కేసులో కామాంధుడైన ఎస్ఐగా పనిచేస్తున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, తన ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments