Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై ఎస్ఐ అత్యాచారం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (10:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడు ఎవరో కాదు. మహిళలతో పాటు సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఎస్ఐ కావడం గమనార్హం. ఈ ఘటన జైపూర్‌ సమీపంలోని దౌసా జిల్లాలో జరిగింది. బాధిత బాలిక వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. 
 
జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న భూపేంద్ర సింగ్ శుక్రవారం బాధిత చిన్నారికి తినుబండారాలు ఆశజూపి తన అద్దె గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిందితుణ్ని పట్టుకొని కర్రలు, చెప్పులతో దేహశుద్ధి చేశారు. చిన్నారిపై ఎస్ఐ అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటని గవర్నర్ కల్రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
 
మరోవైపు, ఈ కేసులో కామాంధుడైన ఎస్ఐగా పనిచేస్తున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, తన ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments