తెలంగాణ దేవస్థానాల్లో విజయ డెయిరీ నెయ్యి మాత్రమే

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (07:57 IST)
తెలంగాణలో విజయ డెయిరీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి ప్రోత్సహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.

ఏటికేడు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో... పోషకాహార భద్రత ఇచ్చే ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వినియోగం, ఉత్పత్తులకు గిరాకీ సృష్టించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు.

తెలంగాణలో... ప్రత్యేకించి జంట నగరాల్లో యువతకు ఉపాధి కల్పన దిశగా విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో విజయ డెయిరీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.

పార్లర్‌లో తిరిగిన మంత్రి... పాల ఉత్పత్తులను పరిశీలించారు. కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని దేవస్థానాల్లో విజయ డెయిరీ ఉత్పత్తులైన నెయ్యి మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేశారు.

సమ్మక్క సారక్క జాతరలో 20 విజయ డెయిరీ స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కృష్ణా, గోదావరి నదీ పుష్కరాల్లోనూ విజయ డెయిరీ ఉత్పత్తులు విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments