Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపూరి తినడానికి వెళ్తే.. వాగులో కొట్టుకుపోయారు.. చివరికి?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:09 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. భారీగా వరద నీరు రోడ్డుపై రావడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగులు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి. అంతే కాక కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. అయితే నగరంలో గురువారం వర్షం ఎక్కువగా లేకపోవడంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
 
కాస్త వరదలు తగ్గుముఖం పట్టండంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరు యువకులను తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు మంగళవారం సాయంత్రం పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. అయితే గురువారం కాస్త వరదలు తగ్గుముఖం పట్టడంతో మృతదేహాల ఆచూకీ లభ్యమయింది. దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
 
ఇదిలా ఉంటే నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో కూడా ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరదలు ఎక్కువగా రావడంతో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments