Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపూరి తినడానికి వెళ్తే.. వాగులో కొట్టుకుపోయారు.. చివరికి?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:09 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. భారీగా వరద నీరు రోడ్డుపై రావడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగులు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి. అంతే కాక కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. అయితే నగరంలో గురువారం వర్షం ఎక్కువగా లేకపోవడంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
 
కాస్త వరదలు తగ్గుముఖం పట్టండంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరు యువకులను తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు మంగళవారం సాయంత్రం పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. అయితే గురువారం కాస్త వరదలు తగ్గుముఖం పట్టడంతో మృతదేహాల ఆచూకీ లభ్యమయింది. దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
 
ఇదిలా ఉంటే నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో కూడా ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరదలు ఎక్కువగా రావడంతో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments