Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలమ్మా.. అన్నమీద కోపముంటే ఏపీలో చూపించుకో : మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (07:24 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై షర్మిలకు కోపం ఉంటే ఆంధ్రాలో చూపించుకోవాలి గానీ తెలంగాణాలో పనేమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నిచారు. 
 
ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు షర్మిల ఎవరు, ఆమెకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. అత్తమీద కోసం దుత్తమీద చూపించినట్టుది షర్మిల వ్యవహారం. అన్నమీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కానీ తెలంగాణాలో ఏర్పాటు చేస్తే ఏం లాభం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
అస్సలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో షర్మిలకు ఆవగింజంత భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. షర్మల తండ్రి వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర బద్ధ విరోధి, వ్యతిరేకి కూడా. ఆయన చనిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి. కానీ, ఇపుడు షర్మిల ఇక్కడకు వచ్చిన నేను రాజన్నబిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణా కోడలిని అంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకుంటే ఎవరైనా నమ్ముతారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments