Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు ఉన్నాడా? కేటీఆర్ ప్రశ్న

ktramarao
, గురువారం, 14 ఏప్రియల్ 2022 (16:53 IST)
బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రం నిరంకుశ పాలనపై అందరం కలిసి పోరాటం చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

దళిత బంధు విజయవంతమైతే దేశం యావత్తు తెలంగాణ వైపే చూస్తుంది అని దేశంలో ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు ఉన్నాడా? అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్.

తెలంగాణ సర్కారు దళితుల అభ్యున్నతి కోసం ద‌ళిత బంధు పేరిట ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ.10ల‌క్ష‌లు ఇచ్చే ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేశామ‌ని..తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో దళితులకు పెద్దపీట వేశామని తెలిపారు.
 
ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే రెండు కులాలు. ఒకటి ఉన్నోవారు. అమెరికాలో కూడా రెండు కులాలున్నాయి. ఒకటి నల్లోడు, రెండు తెల్లోడు హైదరాబాద్‌లో ఉండే మాకు కులాల పట్టింపులు ఉండదని కేటీఆర్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
అయితే దేశంలో కులం, మతం పిచ్చి పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. తెలంగాణను మా ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రం ప్రభుత్వం ఓర్వలేక అభివృద్ధికి అడ్డుపడుతోంది అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న‌ది ఎవ‌రో ఆలోచించాలని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ